హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ను మోదీ సరారు తమ జేబుసంస్థగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక విధివిధానాలకు సంబంధించిన బిల్లులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
ముగ్గురు స భ్యుల కమిటీలో ఇద్దరు ప్రభుత్వంలోని వ్యక్తులే ఉంటే.. తమ అనుయాయులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్లుగా నియమించుకునే అవకాశం ఉన్నదని, తద్వా రా రిగ్గింగ్ చేసినా, ఈవీఎంలలో డాటా మార్చినా, ఫలితాలను తారుమారు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం వెంటనే బిల్లును సవరించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరును కమిటీలో చేర్చాలని డిమాండ్ చేశారు.