హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ): ఓట్ల కోసం రాజకీయం చేసే మాయావతికి అంబేద్కర్ విగ్రహంపై మాట్లాడే నైతిక హక్కులేదని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి మండిపడ్డారు. యూపీలోనే దిక్కూ దివానం లేకుండా పోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణకు వచ్చి సీఎం అభ్యర్థిని ప్రకటించటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
యూపీలోనే బీఎస్పీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ మాట్లాడటం చూస్తే మాయావతి మానసికస్థితిపై అనుమాన పడాల్సి వస్తున్నదని విమర్శించారు. బీఎస్పీ పేరు చెప్పుకొని తిరుగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దళిత బహుజనులను పూర్తిగా పకన పెట్టేసి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నా, దళితులపై దాడులు పెరిగిపోతున్నా మాయావతి ఎందుకు నోరు మెదపరని నిలదీశారు.