హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ధర్నాలు చేసిందెవరు? టీఎస్పీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిందెవరు? అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేయాలని కథనాలు ప్రసారం చేసిన మీడియా ఎవరిది? ఇప్పుడు ఎన్నికలున్నాయని పరీక్షలు రద్దు చేస్తే దానిని కూడా సరారుకు ఆపాదించి రాజకీయం చేస్తున్నదెవరు? అంటూ శనివారం ఒక ప్రకటనలో నిలదీశారు.
తమ బిడ్డ చావుని రాజకీయం చేయొద్దని ప్రవళిక తల్లిదండ్రులు వేడుకున్నా.. వారి కన్నీరు చూసి కూడా విపక్షాలు నీచమైన రాజకీయాలను ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీని మించి మరో పార్టీ నాయకుడు ఏదో ఘనకార్యం చేసినట్టు అకడకు చేరి రాత్రం తా డ్రామా నడిపించారని, పసిబిడ్డల శవాల మీద రాజకీయం సిగ్గుచేటని ఫైరయ్యారు. శవం కనబడగానే రాబంధుల్లా వాలిపోవడం ప్రతిపక్షాలకు వెన్నతో పెట్టిన విద్య అని సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధం వేగంగా వ్యాప్తి చెందొచ్చుగాక.. నిజం నిలకడ మీద తెలుస్తుందని తెలిపారు.