వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఎర్రబంగారానికి రికార్డుస్థాయి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 70 వేల బస్తాల మిర్చి రాక
కాశీబుగ్గ/ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 14: వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు పేర్కొన్నారు. అటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సైతం మిర్చి రూ.19వేలు పలికింది. సోమవారం ఇక్కడికి రైతులు 70 వేల బస్తాల మిర్చిని తీసుకొచ్చారు. యార్డుకు భారీగా పంట రావడంతో సాయంత్రం వరకు కాంటాలు, తోలకాల ప్రక్రియ కొనసాగింది.