యాదాద్రి, నవంబర్ 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో రూ. 14,66,38,097 ఆదాయం సమకూరింది.
సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ ఏడాది అధికంగా జరిగాయి. మొత్తం 21,480 మంది భక్తులు వ్రతాల్లో పాల్గొనగా.. రూ.1,71,84,000 ఖజానాకు చేరింది. గతేడాది కార్తిక మాసంలో రూ.7,35,10,307 ఆదాయం రాగా వ్రతాల్లో 19,176 మంది మాత్రమే పాల్గొన్నారు. ఆలయ పునఃప్రారంభం అనంతరం నూతనాలయంలో కార్తిక మాసం ఆదాయం దాదాపుగా 50 శాతం పెరిగిందని ఆలయ అధికారులు వెల్లడించారు.