హైదరాబాద్, మార్చి 9 : తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. దేశ చరిత్రలో ఒకేసారి అధిక గ్రూప్-1 పోస్టులు నింపే ప్రక్రియకు తెరలేచింది. 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ మంజూరుచేయనున్నట్టు బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో గ్రూప్-1 పోస్టులు వేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ ఇలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. బహుశా దేశంలోనే ఇది తొలిసారి కావొచ్చు. ఉమ్మడి ఏపీలో, ఇతర రాష్ర్టాల్లో అయినా గ్రూప్-1 స్థాయిలో 100 నుంచి 200 పోస్టులకే నోఫికేషన్ వచ్చిందని, 503 పోస్టులతో నోటిఫికేషన్ రాలేదని పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు తెలిపారు. ఇది తెలంగాణ విద్యార్థులకు సువర్ణావకాశమని పేర్కొన్నారు. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో 2011లో 312 పోస్టుల భర్తీకి, అంతకుముందు 2008లో 198 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసుల నేపథ్యంలో ఈ పోస్టులు 2018లో నింపారు. రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణకు 141, ఏపీకి 171 పోస్టులను కేటాయించారు.
పెద్ద పోస్టులు.. మన బిడ్డలకే దక్కేలా
గ్రూప్-1 నోటిఫికేషన్ వేయడం లేదని, ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ, ఈ ఆలస్యానికి అర్థవంతమైన కారణం ఉ న్నది. ఉన్నత ఉద్యోగాలు మన పిల్లలకే దక్కాలనే లక్ష్యం గా కూడా ఉన్నది. గ్రూప్-1 పోస్టులన్నీ ఉన్నతస్థాయి పోస్టులే. డీఎస్పీ, సీటీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వంటి కీలక పోస్టులుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో మెజార్టీ పోస్టులు ఏపీవారికే దక్కేవి. తెలంగాణ ఏర్పడిన తర్వా త కూడా కీలక పోస్టులు ఏపీ వాళ్లకు దక్కకుండా ప్రభు త్వం కీలక చర్యలు తీసుకున్నది. జోనల్ వ్యవస్థలో, లోకల్ రిజర్వేషన్లలో మార్పులు చేసింది. ఇందుకు కొంత సమయం పట్టింది. ఇవన్నీ పరిష్కరించిన తర్వాతే ఇప్పుడు గ్రూప్-1 నోటిఫికేషన్ జారీకి నిర్ణయించింది.
జోన్ క్యాడర్: ఈ క్యాడర్లో కాళేశ్వరం జోన్లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్వో) 80 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేస్తే 76 పోస్టులు కాళేశ్వరం జోన్ పరిధిలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభ్యర్థులు పోటీపడవచ్చు. మిగిలిన 4 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా జోన్లలోని అభ్యర్థులు, కాళేశ్వరంలోని వాళ్లు కూడా పోటీపడవచ్చు.
మల్టీజోన్ -1: ఈ క్యాడర్లో ఆర్టీవో పోస్టులకు మల్టీజోన్-1 పరిధిలోని కాళేశ్వరం, బాసర, భద్రాద్రి, రాజన్న జోన్లలోని వారు 95 శాతం, మిగిలిన 5 శాతం ఉద్యోగాలను ఓపెన్ కోటాలో భర్తీ చేస్తారు. అంటే ఓపెన్ కోటాలోని 5 శాతం పోస్టులకు మల్టీజోన్-2తో పాటు, మల్టీ జోన్-1 అభ్యర్థులు అర్హులే.