సిద్దిపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలకు సిద్ధ్దమైంది. శుక్రవారం నుంచి ఈనెల 16 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇది సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ ఆలయం. రూ.3.50 కోట్లతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ సందర్భంగా శ్రీపద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించడానికి ఏ ర్పాట్లు పూర్తి చేశారు. ఈ మహోత్సవాలకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు హాజరుకానున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. 1985 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఈ ఆలయంలోనే పూజలు నిర్వహించి నామినేషన్ వేశారు. ఇక్కడే పూజలు చేసి టీఆర్ఎస్ను స్థాపించారు.