హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): స్వ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే పోరాటయోధులైన సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్యకు సముచిత గుర్తింపు దక్కిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పేర్కొన్నారు. వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే ఇందు కు నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.