హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు వచ్చే నెలలో (ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
అన్ని పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్, మొదటి, రెండో, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 22వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.
బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును వచ్చే నెల 1వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించవచ్చని చెప్పారు.
బీఫార్మసీ నాలుగు, ఆరు, ఎనిమిదో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, మూడు, అయిదు, ఏడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 30వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 2వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని పేర్కొన్నారు.
బీసీఏ ఆరో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, రెండు, మూడు, అయిదో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 30వ తేదీలోగా, రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 6వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు.