నిజామాబాద్ : దేశంలోని ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన స్వాతంత్య్రం అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం బాన్సువాడ పట్టణంలో జరిగిన ఫ్రీడం ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఇది దేశ ప్రజల పండుగ. కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధించింది కాదన్నారు.
బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు.
వారు భవిష్యత్ తరాల స్వేచ్ఛ కోసం పోరాడారు. అలాంటి మహనీయుల స్ఫూర్తిని బావితరాలకు అందించాలన్నారు. పేదరికం పోగొట్టి పెద్దలు చూపిన మార్గంలో ప్రయాణించాలి. భారత రాజ్యాంగం ప్రకారం దేశాభివృద్ధికి అందరం పునరంకితం కావాలని స్పీకర్ పిలునిచ్చారు.