జూబ్లీహిల్స్, మార్చి 10: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం వారు హైటెక్స్లో క్రెడాయ్ పాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ.. తెలంగాణలో రియల్ ఎస్టేట్, అనుబంధ రంగాలను బలోపేతం చేయడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఆమోదించిన ప్రాజెక్టులను మాత్రమే ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శనకు ఉంచినట్టు క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రియల్ రంగంలో చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాల కంటే హైదరాబాద్ ముందువరుసలో ఉన్నదని క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి బీ జగన్నాధరావు అన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్ జైదీప్రెడ్డితోపాటు పలువురు డెవలపర్లు పాల్గొన్నారు.