హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన ఆయన ముఖ్యమంత్రితో తన అనుభవాలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.
కాగా, ప్రభుత్వాలు దివాలా తేసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దని, ఉంటే నిరుపేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమేనని రెండు రోజుల క్రితం రాఘురామ్ రాజ్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇస్తున్నాయని, అది సరికాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.