హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్కుమార్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన క్విజ్ జోనల్ పోటీల్లో తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరి విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పోటీలో తమిళనాడుకు చెందిన జీ రామప్రియ, ఎస్ ఆకాశ్ విజేతలుగా నిలిచారు. జోనల్ స్థాయి పోటీలో పాల్గొన్న విద్యార్థులను అజయ్కుమార్ సన్మానించారు.