హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారంపై రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సచివాలయంలో మంత్రి గం గుల కమలాకర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సమస్యలను ఒకొకటిగా పరిషారం చేస్తున్నదని మంత్రి గంగుల తెలిపారు. దేశంలో పేదలు ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తున్నారని చెప్పారు.