హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీలర్ల కమీషన్ను పెంచుతూ నిర్ణ యం తీసుకున్నది. ప్రస్తుతం టన్ను బియ్యంకు రూ.900లుగా ఉన్న కమీషన్ను రూ.1,400 లకు పెంచింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కమీషన్ను పెంచుతున్నట్టు మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రేషన్ డీలర్లతో సమావేశమై వారి సమస్యలపై చర్చించి పరిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు సమయంలో డీలర్లకు టన్నుకు రూ.200 మాత్రమే కమీషన్ ఉన్నదని, రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్ పెద్ద మనుసుతో ఈ కమీషన్ను రూ.900లకు పెంచినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు దీనిని రూ.1,400లకు పెంచారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రేషన్ డీలర్లకు ఏకంగా 700 శాతం (7 రెట్లు) కమీషన్ పెంచిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.
17,227 మంది డీలర్లకు మేలు
రేషన్ డీలర్లకు కమీషన్ పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.139 కోట్ల అధనపు భారం పడుతుందని మంత్రులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17,227 రేషన్ షాపులున్నాయని, కమీషన్ పెంపుతో ఈ డీలర్లందరికీ మేలు జరుగుతుందని వివరించారు. తెలంగాణలో మాత్రమే ఏ ఒకరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒకొకరికీ ఆరుకిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నదని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం కేంద్రం 5 కిలోలు ఇస్తుంటే వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో అధనంగా కిలో చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.
మరో 13 సమస్యలు పరిష్కారం
ఏకమొత్తంగా రూ.1,400 కమీషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 సమస్యలను ప్రభుత్వం పరిషరించింది. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతు, నేత, గౌడ తదితరులకు అమలవుతున్న బీమా తరహాలో రేషన్ డీలర్లకు కూడా రూ.5 లక్షల బీమా అమలు చేయనున్నది.
ప్రతి డీలర్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం రేషన్ డీలర్లు తమ డీలర్షిప్ను ఏటా రెన్యూవల్ చేసుకొంటుండగా, ఆ రెన్యూవల్ కాలపరిమితిని 5 ఏండ్లకు పెంచింది. ఇక రేషన్ డీలర్షిప్ వయోపరిమితిని 40 నుంచి 50 ఏండ్లకు పెంచింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం కింద రూ.10 వేలు ప్రభుత్వం ఇవ్వనున్నది. 1.5 క్వింటాళ్ల వేరియేషన్ను కేసుల పరిధి నుంచి తీసివేయడం, హైదరాబాద్లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తంచేసింది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
కమీషన్ పెంపుతో సహా తమ ఇతర సమస్యలు పరిషరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ కడుపు నింపేలా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిలకు సమావేశంలోనే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సివిల్ సైప్లె కమిషనర్ వీ అనిల్కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లికార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.