Rat in Curd Packet | పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక కలకలం సృష్టించింది. గ్రేటర్ వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని కిరాణ షాపులో ఓ వ్యక్తి సంగం పెరుగు ప్యాకెట్ కొని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ప్యాకెట్ను కట్ చేసి పెరుగు వేసుకోబోతుండగా అందులో ఎలుక పిల్ల కనిపించింది. అది చూసిన వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. తర్వాత తేరుకుని కిరాణ షాపు యజమానిని నిలదీశారు.
అనంతరం సంబంధిత అధికారులకు వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పెరుగు ప్యాకెట్ విక్రయించిన షాపును పరిశీలించారు. వెంటనే ఆ బ్యాచ్కు సంబంధించిన పెరుగు ప్యాకెట్ అమ్మకాలను నిలిపివేశారు. జనగామలో 50 ప్యాకెట్లు, కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హనుమకొండ భవానీనగర్ షాపుల్లో ఆ బ్యాచ్కు చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సంగం పెరుగును విక్రయించవద్దని షాపు నిర్వాహకులకు అధికారులు జారీ చేశారు.
కాగా, ఆ బ్యాచ్కు సంబంధించిన పెరుగు అమ్మకాలను నిలిపివేయడంతో పాటు శాంపిల్స్ను పరీక్షించేందుకు హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
పెరుగు ప్యాకెట్లో ఎలుక కలకలం
వరంగల్ ఎస్ఆర్ఆర్తోట సమీపంలోని ఓ కిరాణా షాపులో కొనుగోలు చేసిన సంగం పెరుగు ప్యాకెట్లో ఎలుకను చూసి కంగుతిన్న వ్యక్తి
పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి కట్ చేయగా, అందులో చనిపోయిన ఎలుక పిల్ల రావడంతో, కిరాణా షాపు యజమానిని నిలదీసి… pic.twitter.com/D2PRjnNeF4
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2026