తిమ్మాపూర్, ఏప్రిల్ 9: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఈ నెల14న ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు. విగ్రహావిష్కరణ వేడుకలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతలను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రసమయికి అప్పగించిన విషయం తెలిసిందే. వేడుకల్లో పాడనున్న పాట రికార్డింగ్ పనులు హైదరాబాద్లోని ఓ స్టూడియోలో జరుగుతున్నాయి.