కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అడవుల్లో అరుదైన బార్కింగ్ డీర్ (మొరిగే జింక) అటవీ అధికారుల కెమెరాకు చిక్కింది. ఇది దట్టమైన అడవుల్లో ఉంటుంది. దీనిని ఇండియన్ మంట్జాక్గా కూడా పిలుస్తారు. సుమారు 25 ఏండ్ల క్రితం ఆదిలాబాద్ అడవుల్లో ఇలాంటిదే కనిపించింది. 15 ఏండ్ల క్రితం నల్లమల అడవుల్లో కనిపించాక ఈ జాతి జింకల ఉనికి లేకుండా పోయిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకులు, పండ్లను ఆహారంగా తీసుకుంటుందని పేర్కొన్నారు.