హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 13వ తేదీన లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజున ఓటర్లను పోలింగ్ బూత్లకు చేర్చేందుకు ర్యాపిడో(Rapido) ఉచిత రైడ్ అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్ పట్టణాల్లోనూ ర్యాపిడో ఫ్రీ రైడ్ అందుబాటులో ఉండనున్నది. బైక్లు, ట్యాక్సీలు, ఆటోలు, క్యాబ్ రైడ్లను ఉచితంగా కల్పించనున్నారు. ఓటర్లను ఉత్తేజపరిచేందుకు ఎన్నికల సంఘంతో ర్యాపిడో ఒప్పందం కుదుర్చుకున్నది. ఓటర్లలో చైతన్యం కల్పించే ఉద్దేశంతో ఇవాళ ఎల్బీ స్టేడియంలో ర్యాపిడో ఓ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసింది. దానికి సీఈవో వికాస్ రాజ్ హాజరయ్యారు. మే 13వ తేదీన ర్యాపిడో యాప్ కస్టమర్లు .. వోట్నౌ అనే కోడ్ను వాడుకుని ఉచితంగా రైడ్ను పొందవచ్చు. ఆ రోజున దేశవ్యాప్తంగా వంద నగరాల్లో సుమారు 10 లక్షల మంది కెప్టెన్లు ఓటర్లకు అందుబాటులో ఉంటారని ర్యాపిడో కమ్యూటింగ్ యాప్ తెలిపింది.