హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్టీసీఎఫ్సీ) చైర్మన్గా ఇస్లావత్ రామచందర్నాయక్ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో రామచందర్నాయక్కు నియామకపత్రాన్ని అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నోముల భగత్ పాల్గొన్నారు. రామచందర్నాయక్ ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందిన రామచందర్నాయక్ ఎంపీపీగా, జడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో పలు పదవులను నిర్వహించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించటంతోపాటు పార్టీ ఎస్టీసెల్లో సుదీర్ఘకాలం పనిచేశారు.