యునెస్కో గుర్తింపు దక్కిన తర్వాత ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ప్రభుత్వం, పురావస్తు శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులతో కొత్త కళను సంతరించుకొంటున్నది.
ఈమేరకు ఆలయాన్ని కెమికల్ వాష్ చేయగా బ్లాక్ ఫంగస్(పాకురు) తొలగిపోయి తెల్లగా మెరుస్తూ, మరింత శోభను సంతరించుకొన్నది. ఇది చూసిన పర్యాటకులు అద్భుతమంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– వెంకటాపూర్