హైదరాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వంద రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆయన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. వంద రోజుల కార్యక్రమంపై 28న నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి సీఎం హాజరవుతారని తెలిపారు. మార్చి 1న జిల్లా కలెక్టర్ల సమావేశం ఉంటుందని వెల్లడించారు.
మార్చి 2నుంచి జూన్ 9 వరకు వివిధ అభివృద్ధి పనులపై ప్రతి శాఖ తమ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. స్పెషల్ సీఎస్లు జయేశ్ రంజన్, వికాస్రాజ్ , సీవీ ఆ నంద్, సంజయ్కుమార్, మహేశ్ దత్ ఎకా, సబ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్, దాన కిశోర్, అహ్మద్ నదీమ్ పాల్గొన్నారు.