యాదగిరిగుట్ట, డిసెంబర్ 21: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో ఎన్ గీతారెడ్డి గురువారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఇన్చార్జి ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. గీత 2014 డిసెంబర్ 3న డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఎక్స్టెన్షన్పై ఏడాదిపాటు ఆమెను ఈవోగా కొనసాగించారు. నూతన ఈవో వచ్చేవరకు కొనసాగేలా అప్పటి ప్రభుత్వం 2021లో ఆమె పదవీ కాలాన్ని పొడిగించింది. సుమారు 9 ఏండ్లపాటు గీతారెడ్డి యాదగిరిగుట్ట ఈవోగా కొనసాగారు.
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో బాధ్యతలు చేపట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా తొమ్మిదేండ్లపాటు ఈవోగా కొనసాగిన ఘనత గీతారెడ్డికి దక్కింది. ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావుకు ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, మాజీ ఈవో ఎన్ గీత, డీఈవో దోర్బల భాస్కర్శర్మ, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు శుభాకాంక్షలు తెలిపారు.