ఫర్టిలైజర్సిటీ, డిసెంబర్ 5: పెద్దపల్లి జిల్లా రామగుండంలో కొత్తగా నిర్మించిన పోలీసు కమిషనర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైందని, త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు.
సోమవారం ఆయన సీపీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి కొత్త కమిషనరేట్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రామగుండం కమిషనరేట్ను దాదాపు రూ.26 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్టు చెప్పారు.