హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రంజాన్ నెలలో దుకాణాలు 24 గంటలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దుకాణాలు నిరంతరం తెరిచి ఉంచుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు అనుమతిస్తూ కార్మికశాఖ కమిషనర్ సంజయ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనల ప్రకారం సిబ్బందికి సెలవులు, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని స్పష్టంచేశారు. రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి వర్కర్లు పనిచేస్తే సాధారణ వేతనాల కంటే రెట్టింపు వేతనాలు ఇవ్వాలని కోరింది.
సెలవు రోజుల్లో పనిచేసే ఉద్యోగులకు మరొక రోజు సెలవు ఇవ్వాలని తెలిపింది. ఒక్క ఆదివారం మినహా ఏ రోజు కూడా పని వేళలు 13 గంటలకు మించకూడదని పేర్కొంది. మహిళా ఉద్యోగులుంటే షరతులతో కూడిన నైట్ డ్యూటీలు వేయాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా న్యాయాధికారులు, ఇతర విభాగాల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, 24 గంటలూ షాపులు ఓపెన్ చేయాలనుకునే యాజమానులు సంబంధిత అధికారుల దగ్గర రశీదులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.