హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు రాఖీ పండుగను సరికొత్త పద్ధతిలో నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. తప్పనిసరిగా సీటు బెల్ట్, హెల్మెట్ ధరించాలని, త్రిపుల్ రైడింగ్ చేయొద్దని సూచించారు. ఆ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మహిళా పోలీసులు రాఖీలు కట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఇకపై ఉల్లంఘించబోమని వాహనదారుల చేత పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంలో వాహనదారులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. ట్రాఫిక్ పోలీసులు చేసిన ఈ మంచి పని పట్ల హైదరాబాదీలో ప్రశంసలు కురిపించారు. ట్రాఫిక్ పోలీసుల పనితీరును రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.