Harish Rao | రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అక్కాచెల్లెమ్మలు ఆత్మీయంగా రాఖీ కట్టారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సోదరీమణుల ప్రేమ, ఆప్యాయత నాకు ఎప్పటికీ ప్రత్యేకం. తెలంగాణలో ప్రతి సోదరి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.#rakshabandhan #rakhi pic.twitter.com/AxCHL7mIWx
— Harish Rao Thanneeru (@BRSHarish) August 28, 2026