Vemulawada | రాజన్న సిరిసిల్ల : మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి వారిని రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ శుక్రవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడకు విచ్చేసిన ఎంపీ విజయేంద్ర ప్రసాద్ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.