హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ్యాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా వీరంతా నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శించినట్టు వివేక్ ఠాకూర్ ఫిర్యాదు చేయడంతో రాజ్యసభ చైర్మన్ కార్యాలయం ఈ నోటీసులను జారీ చేసింది. ఈ నెల 28లోపు సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు.