నందిపేట్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ (Nandipet) మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన బుధవారం.. ప్రాతః ఆరాధనతో ప్రారంభమైన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సేవాకాలం నివేదన, మంగళాశాసనాలు, శాత్తుమోరై, వేద విన్నపాలు, ద్వారా తోరణ ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం మూలమంత్రమూర్తి మంత్రహవనం, పంచసూక్తం పరివార ప్రాయశ్చిత్త హవనం, నిత్యపూర్ణాహుతి, నివేదన, మంగళాశాసనములు, వేద విన్నపాలు, శాత్తుమోరై, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సాయంత్రం 6 నుంచి 9.30 గంటల వరకు.. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ద్వార తోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం, మూల మంత్రమూర్తి, మంత్ర హవనములు, ప్రతిష్ఠా విగ్రహాలకు ఫల పుష్ప శయ్యాధివాసము, తత్వ వ్యాస హవనము, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనము, నిత్య పూర్ణాహుతి, నివేదన, మంగళాశాసనము, వేద విన్నపాలు, శాత్తుమోరై, తీర్థప్రసాద గోష్టి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంల్లో ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.