Rajiv Sagar | హైదరాబాద్ : మైనార్టీలకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. కులాహంకారంతో కావాలనే మైనార్టీ వర్గానికి చెందిన పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్రపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న మైనార్టీ అధికారులపై బురదజల్లే యత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి తన కులాంహరానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా పనిచేస్తున్న రేవంత్ మైనార్టీ అధికారులను చూస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మైనార్టీల అభివృద్ధికి కృషి చేయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మైనార్టీ అధికారులపై విషం చిమ్ముతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు స్టీఫెన్ రవీంద్ర అనే అధికారికి ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మచ్చ లేదన్నారు. 2005లో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 61 మందిని కాపాడడంతో శౌర్యపతకం, 2011 ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ పతకం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. మళ్లీ ఒక్క సారి మైనార్టీ వర్గంపై గానీ, మైనార్టీ అధికారులపై గానీ బురదజల్లే యత్నం చేస్తే రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ది చెబుతామని హెచ్చరించారు.