హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తోట ఆగయ్యను సీఎం కేసీఆర్, కేటీఆర్ శాలువాతో సత్కరించారు.
సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో తోట ఆగయ్య అనుచరులు కూడా ఉన్నారు. తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట మండలం మాజీ జడ్పీటీసీ. జనవరి 26వ తేదీన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే.