తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా.. రజకులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ల్యాండ్రీ షాపుకు 250 యూనిట్ల వరకు విద్యుత్ను ఫ్రీగా ఇస్తూ జీవో జారీ చేశారు. గ్రామాల్లో దోబీ ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. రజకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. 250 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం. హుజూరాబాద్ జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. – రజక సంఘం నాయకుడు పూసల సంపత్ ( మామిడాలపల్లి గ్రామం, వీణవంక మండలం )