హుజూరాబాద్ మండల రజక సంఘం తీర్మానం
హుజూరాబాద్, జూన్ 6: ఎప్పుడూ టీఆర్ఎస్ వెంటే ఉంటామని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల రజక సంఘం ప్రకటించింది. నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైతే టీఆర్ఎస్ అభ్యర్థికి అండగా ఉంటామని ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రతిజ్ఞ చేయడంతోపాటు తీర్మాన పత్రాన్ని హుజూరాబాద్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్బాబుకు ఆ సంఘం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. బలహీనవర్గాలను ఆదుకున్న ఏకైక నాయకుడు ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఆయనకు అండగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ మాట్లాడుతూ.. తండ్రిలాంటి సీఎం కేసీఆర్పై అభాండాలు మోపిన మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఉపఎన్నికలు అనివార్యమైతే టీఆర్ఎస్ తడాఖా చూపించాలని పిలుపునిచ్చారు.