Rains | హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం ఆగ్నేయం, నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.