హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. శుక్రవారం అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.