హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్నగర్, బహదూర్పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. జంట నగరాల పరిధిలో పలు చోట్ల చిరు జల్లులు కురిశాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి.
ఎండ వేడిమితో అల్లాడిపోతున్న జనాలకు వాతావరణం కాస్త చల్లబడడంతో ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్నాటక వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.