Rain Alert | మండువేసవిలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల వానలు.. మరికొద్ది చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే మూడు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని హెచ్చరించింది.
గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాఆద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వచే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
శుక్రవారం నిర్మల్, నిజామాఆద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. అలాగే, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. అలాగే, శని, ఆది, సోమవారాల్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది.