హైదరాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ) : రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు. శనివారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. దీంతో ఆయా జిల్లాలకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీచేశారు.