Rahul Gandhi | హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరిస్థితి. అదేపనిగా అబద్ధాలు చెబితే ప్రజలు నవ్వుకుంటారనే కనీసం ఇంగితం లేకుండా తుక్కుగూడ సభలో అబద్ధాలను వల్లెవేశారు. ‘పాడిందే పాడరా..’ అన్నట్టు గత సభలో చె ప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని పట్టించుకోకుండా రాజకీయమే పరమావధిగా, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా నోటికొచ్చిన అబద్ధాలు పలికారు. గల్లీస్థాయి నేతలా మాట్లాడేశారు. వాస్తవాలేంటో తెలుసుకోకుండా రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివేశారు.
వాస్తవం: ఇంతకు మించి మరో అబద్ధం ఉండదు. జాతీయస్థాయి నేత ఇంతలా దిగజారి మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హాకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. ప్రచారం కో సం హైదరాబాద్ వచ్చిన ఆయనకు బ్రహ్మాండంగా స్వాగతం పలికింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు యశ్వంత్సిన్హాకే మద్దతు ఇచ్చారు. ఈ విషయాన్ని మర్చి న రాహుల్గాంధీ.. బీజేపీకి సీఎం కేసీఆర్ అ న్ని విధాలుగా మద్దతిస్తున్నారంటూ రాహుల్ మరో ఆరోపణ చేశారు. దేశానికి ఉపయోగమైన వాటికి భేషరతుగా మద్దతిచ్చామని, హాని చేసే వాటిని వ్యతిరేకించామని కేసీఆర్ ఇది వరకే స్పష్టం చేశారు.
వాస్తవం: ఈ వ్యాఖ్యలు కూడా రాహుల్ అవగాహన రాహిత్యానికి అద్దం పడుతున్నాయి. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పలుమార్లు ఆమె విచారణకు కూడా హాజరయ్యారు. మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డితో పాటు మరికొందరు ఎంపీలపైనా ఈడీ, ఐటీ దాడులు చేశాయి. వీటన్నింటిని దాచేసి సీఎంపై కేసులు పెట్టడం లేదంటూ అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు.
వాస్తవం: బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని రాహుల్ ఆరోపించారు. ఇంతకన్నా సిగ్గుచేటు మరోటి ఉండదు. దేశంలో ఎక్కడైనా ఇవి కలిసి పోటీ చేశాయా? అలాంటప్పుడు ఇవి ఎలా ఒక్కటి అవుతాయనేది ఆయనకే తెలియాలి. దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ప్రశ్నించకుండా మిన్నకుండిపోతే బీఆర్ఎస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకొని కాషాయ పార్టీని నిలదీస్తున్నది. జాతీయస్థాయిలో బీజేపీపై సీఎం కేసీఆర్ రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ కబంధ హస్తాల నుంచి విడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో దేశ సాగురంగం, రైతుల ముఖచిత్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్న బీఆర్ఎస్పై రాహుల్ ఇలాంటి నిందలు వేయడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం.
వాస్తవం: ఈ వ్యాఖ్యలు కూడా రాహుల్ అవగాహన రాహిత్యానికి నిదర్శం. కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17న ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. బీజేపీ నిరుటి నుంచి ఇదే రోజున సమావేశం నిర్వహిస్తున్నది. అంతేకానీ, కాంగ్రెస్ సభ పెట్టుకున్నదని ప్రత్యేకంగా సభలు నిర్వహించలేదనే విష యం ఆయన తెలుసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్సే ఈ రెండు పార్టీలకు పోటీగా సభ పె ట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్, బీజేపీ సభలు నిర్వహిస్తాయని ముందే తెలిసినప్పటికీ కాంగ్రెస్ అదేరోజు సభ పెట్టేందుకు నిర్ణయించడం వెనక ప్రణాళిక ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి.