హైదరాబాద్ : రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై అనర్హత వేయడం పిరికి చర్యని రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి (Vasudeva reddy) అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) తీరును యావత్తు దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడం, ప్రతిపక్ష నాయకులపై ఈడీ దాడుల(ED Raids)తో భయాందోళనలకు గురిచేయడం బీజేపీకే దక్కిందని మండిపడ్డారు.
రాజకీయ కక్షతోనే రాహుల్ సభ్యత్వం పై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలకతీతంగా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఎన్ని కేసులు నమోదు చేయాలి ? ఎంతమంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర బడ్డాయని పేర్కొన్నారు.