హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖలో గెజిటెడ్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ(డీపీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్రావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి వ్యవసాయ శాఖ డైరెక్టర్ కన్వీనర్గా, కో-ఆపరేషన్ శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ సభ్యులుగా ఉండనున్నారు.