R.Krishnaiah | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులు పెంచాలని, టీచర్ పోస్టులను 25వేలకు పెంచాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యానగర్ బీసీ భవన్ వరకు శుక్రవారం నిరుద్యోగులు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. గ్రూప్ 1 సర్వీస్ కింద 503 పోస్టులు ప్రకటించారని, కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులు కరెక్టుగా లెక్కిస్తే 1600కు, గ్రూప్ 2 సర్వీస్ కింద 2200, గ్రూప్3 కింద 3వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని వివరించారు. గ్రూప్ 4 కింద 25వేల వరకు పోస్టులు ఉన్నాయని తెలిపారు. సత్వరమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.