కాచిగూడ, ఏప్రిల్ 3: బీసీల సమస్యలను పరిష్కరించకుంటే త్వరలోనే మిలిటెంట్ ఉద్య మం చేపడుతామని, దేశంలో అగ్గి పుట్టిస్తామ ని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీల సమస్యలపై కేంద్రం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సోమవారం చేపట్టిన మహాధర్నాలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాలకు చెందిన వేలాది మంది బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు ప్రధాని మోదీ వ్యతిరేకమని కృష్ణయ్య విమర్శించారు.