వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీ రకం మిర్చి ధర రికార్డు స్థాయిలో నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్కు చెందిన బీ రాజేశ్వర్రావు.. మార్కెట్కు 40 బస్తాలు తీసుకురాగా వ్యాపారి అత్యధికంగా క్వింటాల్ రూ.35 వేల చొప్పున కొనుగోలు చేశారు. సోమవారం మార్కెట్కు సుమారు 35 వేల బస్తాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
– కాశీబుగ్గ