హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తమపై 2011లో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
పూర్తి వివరాలు నివేదించాలని ప్రతివాదులైన అధికారులు, పోలీసులకు నోటీసులు జారీచేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు వేర్వేరుగా వేసిన వ్యా జ్యాలపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సుజన ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన అనంతరం విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేశారు.