కరీంనగర్ : స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య(Quality Education)ను అందిస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం(Planning board) ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని కృషిభవన్లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల కోసం నిర్వహిస్తున్న వారధి స్టడీ సెంటర్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు అంశాల గురించి మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏకాగ్రతతో చదివి ఉన్నత లక్ష్యాలు(achieve goals) సాధించాలని సూచించారు. స్టడీ సెంటర్(Study Center)కు అవసరం ఉన్న పుస్తకాలు, స్టడీ చైర్లు, ప్యాడ్లు అందిస్తామన్నారు. రీడింగ్ సెంటర్లో యువత చదువును ఎలా కొనసాగిస్తున్నారో అనే విషయాన్ని అభ్యర్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రీడింగ్ సెంటర్లో అభ్యర్థుల జీకే పరిజ్ఞానాన్ని పరీక్షించారు.
ప్రతిమ ఫౌండేషన్ కల్పిస్తున్న రీడింగ్ సెంటర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. స్టడీ సెంటర్కు వచ్చి ప్రిపేర్ అయిన 39 మంది వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రీడింగ్ సెంటర్లో అభ్యర్థులందరికీ ఉచితంగా లస్సీని అందజేయన్నట్లు ప్రకటించారు. ఆయన వెంట నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, నాయకులు ఉన్నారు.