అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్, ఫిబ్రవరి 25: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకానికి శ్రీకారం చుట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పూర్తైన ‘మన ఊరు-మన బడి’ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంత రం జరిగిన సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులోనే కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు.