హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పీవీ శతజయంతి వేడుకల కమిటీ ఛైర్మన్ ఎంపీ కే కేశవరావు తెలిపారు. పీవీ నరసింహారావు మార్గ్ను సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కేకే సందర్శించారు. ఈనెల 28న పీవీ శత జయంతిని పురస్కరించుకొని పీవీఎన్ఆర్ మార్గ్లో ఆయన విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాలను కేకే పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 28న పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్గా మార్చుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.