వరంగల్ రూరల్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన నర్సంపేట మండలం లక్నేపల్లిలో ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. పీవీ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ప్రధాన మంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాది వ్యక్తి, మన తెలంగాణ చెందినవాడని చెప్పారు. బహుభాషావేత్త, ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేయడం ద్వారా కుంటుపడుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్నారని తెలిపారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పీవీ.. రాష్ట్రమంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులను అధిష్టించారని చెప్పారు.
నర్సంపేట ప్రాంతానికి చెందిన మన మట్టి బిడ్డ మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజూ దేశంమంతటా కీర్తించబడటం ఎంతో గర్వకారణం అన్నారు. మచ్చలేని నిస్వార్ధ రాజకీయ జీవితాన్ని నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.